విద్యార్థులకు నిరుపయోగంగా శుద్ధజల యంత్రం

73చూసినవారు
విద్యార్థులకు నిరుపయోగంగా శుద్ధజల యంత్రం
సి. బెళగల్ లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తాగునీటి శుద్ధియంత్రం గత మార్చి నెలలో మరమ్మతులకు గురైందని గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. మొత్తం 1, 250 మంది విద్యార్థులు చదువుతున్నారని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనా యంత్రానికి మరమ్మతులు చేపట్టకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి నీటిశుద్ధి యంత్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్