కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన మాలిగాపోగు లక్ష్మన్న, బొగ్గులు బాబులు సోమవారం తన నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు కోడుమూరు ఎన్నికల అధికారి శేషిరెడ్డి ప్రకటించారు. అంతకుముందు కర్నూలు నగరంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ఉపసంహరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డికి అందజేశారు.