నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ మహిళల నిరసన

72చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ బుధవారం కోడుమూరులో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు విజయభారతి మాట్లాడారు. సీఎం చంద్రబాబు మహిళా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. రాష్ట్రలో మద్యం దుకాణాలను భారీగా పెంచి మహిళల మంగళసూత్రాలు తెంపాలని చూస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్