పెద్దకడుబూరు మండలంలోని జాలవాడిలో వెలసిన శ్రీ భీమరాయస్వామి రథోత్సవం సోమవారం అశేష భక్తవాహిణి నడమ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం స్వామివారికి ఆలయ అర్చకులు నాగరాజు స్వామి జలాభిషేకం, పుష్పాలంకరణ, పంచామృతాభిషేకంలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని ఆలయంలో నుండి ఊరేగింపుగా రథం వద్దకు తెచ్చారు. అలాగే స్వామివారి పూర్ణ కుంభంతో ఊరేగింపు తెచ్చారు.