శ్రీ మఠంలో సుదర్శన హోమం

72చూసినవారు
శ్రీ మఠంలో సుదర్శన హోమం
ధార్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భాద్రపద శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు సుదర్శన హోమం నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి ప్రత్యేక పూజలు, అన్నదాన ప్రసాదాలకు విరామం పలికారు. సంస్థాన పూజల్లో భాగంగా శ్రీ మూల రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్