కరువు మండలాలను ప్రకటించాలి .. సీపీఐ డిమాండ్

51చూసినవారు
కరువు మండలాలను ప్రకటించాలి .. సీపీఐ డిమాండ్
నందికొట్కూరు అగ్రికల్చర్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నందికొట్కూరు నియోజకవర్గంలోని కరువు మండలాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు అరకోర పడినందువల్ల మొక్కజొన్న, పత్తి, మిరప, మినుము, కొర్ర, తదితర పంటలు పంట దిగుబడి రాక ఎండిపోయి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్