నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా వైయస్ ఆర్ సిపి సానుభూతిపరుడు కామినీ విష్ణువర్ధనరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ గురువారం నంద్యాల లో దాఖలుచేశారు. నామినేషను దాఖలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక వైసిపి నిజస్వరూపం తెలిసిందన్నారు. డాటా చోరిపై తాను వైసిపి పెద్దలను కలిసినప్పడు వైసిపి నిజస్వరూపం బయటపడిందన్నారు.