పాణ్యం: ఎస్ఆర్బీసీలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం

64చూసినవారు
పాణ్యం: ఎస్ఆర్బీసీలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
పాణ్యం పట్టణ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాల్వలో ఈనెల 13న నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన వెన్నెల (20) అనే యువతి మృతదేహం బుధవారం లభ్యమైంది. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన వెన్నెల స్నానం కోసం ఎస్సార్బీసీ కాల్వలోకి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకోగా, మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండ వద్ద ఆమె మృతదేహం లభ్యమైనట్లు పాణ్యం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్