మట్టితో భారీ వినాయకుడి విగ్రహ ప్రతిష్ట

72చూసినవారు
పత్తికొండ మండల పరిధిలో గల రామచంద్రాపురం గ్రామంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టితో భారీ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ పూజారి నాగరాజారావు తెలిపారు. వినాయకుడి ప్రతిమకు ఉదయం నుండి అర్చనలు విశేష పూజలు వేదయుక్తంగా మంత్రయుక్తంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పండుగ కార్యక్రమాలకు గ్రామ పెద్దలు రైతులు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్