పత్తికొండ: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

72చూసినవారు
పత్తికొండ: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణగిరి మండలంలోని పులిచెర్ల గ్రామం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వారం, పదిరోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయసు 49 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్