జిల్లాలో సీసీహెచ్ లకు 17 నుంచి శిక్షణ: డీఈవో

58చూసినవారు
జిల్లాలో సీసీహెచ్ లకు 17 నుంచి శిక్షణ: డీఈవో
డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం పథకం సీసీహెచ్ లకు ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు మ్యాపింగ్ చేసిన పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు కర్నూలు డీఈవో శామ్యూల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణలో సీసీహెచ్ లతో పాటు ఎంఈఓలు కచ్చితంగా పాల్గొనాలన్నారు. కొన్ని పదార్థాలు చేసేందుకు సీసీహెచ్ లు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు ఈ శిక్షణ ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్