ఎన్నికల సమీపిస్తున్న వేళ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి భారీ షాక్ తగిలింది. మహానంది ఎంపిపి బుడ్డారెడ్డి యశస్విని, ఆమె తండ్రి బుడ్డారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిపి నాగ భూపాల్ రెడ్డి, సీతారామపురం సర్పంచ్ బుడ్డారెడ్డి తేజస్విని, మహానంది దేవస్థానం ధర్మకర్త మల్లికార్జున తదితరులు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.