తిమ్మాపురంలో ఘనంగా జియారత్ వేడుకలు

59చూసినవారు
తిమ్మాపురంలో ఘనంగా జియారత్ వేడుకలు
నంద్యాల జిల్లా మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలో పెద్ద మౌలాలి స్వామి, చిన్న మౌలాలి స్వామి, దస్తగిరి స్వాములకు జియారత్ వేడుకలు గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మొహర్రం పండుగ ముగిసిన 41 రోజులకు జార్తల వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పీర్ల స్వాములకు భక్తులు పూల సూచికలు, కానుకలు సమర్పించారు. మహానంది ఎస్సై ఎన్. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్