ఏపీలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ఘాట్ రోడ్డుల్లో రాకపోకలపై నిషేధం విధించారు. నల్లమల్ల ఫారెస్ట్లోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో అడవిలో ఉండాల్సిన నెమళ్ల బృందం రోడ్డు మీదకు వచ్చింది. అంతేకాకుండా పురివిప్పి నెమళ్లు నాట్యం చేశాయి. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశాడు.