ఎన్నికలకు టీడీపీ-జనసేన వేగంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు 'జెండా' అని నామకరణం చేసినట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.