RBI ఆంక్షల తర్వాత క్రమంగా కోలుకుంటున్న పేటీఎం మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. లెండింగ్ ప్లాట్ఫామ్ సేవలను పునరుద్ధరించనున్నట్లు సమాచారం. మార్చిలో ఈ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా పలు బ్యాంక్/NBFC నుంచి లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ పొందొచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, HDFC, SBI కార్డ్స్ ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.