స్వంత నిధులతో రోడ్లకు మరమ్మతులు చేసి జనసేన కార్యకర్తలు నిస్వార్థానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. శుక్రవారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జి మల్లప్ప నాయకత్వంలో చెక్ పోస్ట్ దగ్గర గుంతలు పడిన రోడ్లకు మరమత్తు చేపట్టినట్లు నాయకుడు పులిరాజు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామని వెల్లడించారు.