అగ్ని ప్రమాదం జరగకుండా సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది

68చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలోగల ఓబులంపల్లె గ్రామంలో సోమవారం రహదారి వెంట ఉన్నటువంటి ముళ్ళపోదలకు, చెత్తకు ఎవరో ఆకతాయిలు నిప్పు పెట్టడంతో అగ్నికీలలు ఎక్కువగా చెలరేగి గ్రామంలోని గడ్డివాములకు ప్రమాదం కలిగే అవకాశం ఉండడంతో గ్రామస్తులు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారి వీరారెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సిబ్బంది మంటలను ఆర్పారు. సకాలంలో స్పందించిన సిబ్బందికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్