అహోబిలంలో ఉగాది సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు

56చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల అహోబిల క్షేత్రంలో ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం ఎగువ దిగువ అహోబిలంలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ కు ఉదయాన్నే నవ కలశ తిరుమంజనం జరిగింది. ఉగాది సందర్భంగా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో శ్రీ అహోబిల 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వాముల వారు పంచాంగ పుస్తకాలను నరసింహస్వామి పాదాల చెంత ఉంచి పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించారు.

సంబంధిత పోస్ట్