కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల సామాజిక పింఛన్లకు సంబంధించి మొత్తం 7, 192 మంది లబ్ధిదారులు ఉన్నారని ఎంపీడీవో సాయి కృష్ణ శనివారం వెల్లడించారు. జులై 1న పింఛన్ పంపిణీ కార్యక్రమనికి 130 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మొత్తం రూ. 4. 91 కోట్ల నగదును పింఛన్ దారులకు అందించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.