సిపిఎం నాయకుడికి పరామర్శ ఎమ్మెల్యే

84చూసినవారు
సిపిఎం నాయకుడికి పరామర్శ ఎమ్మెల్యే
నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి ఆక్సిడెంట్ లో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయము తెలుసుకున్న నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం కర్నూలుకు చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం డాక్టర్ తో మాట్లాడి భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు. కుటుంబ సభ్యులను కలిసి అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్