పాణ్యం: వైన్ షాపులు తొలగించాలని మహిళల ధర్నా

60చూసినవారు
పాణ్యం: వైన్ షాపులు తొలగించాలని మహిళల ధర్నా
పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండల కేంద్రంలోని పొదుపు సమాఖ్య, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల వద్ద ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను తొలగించాలని మండల పొదుపు సంఘం మహిళలు సోమవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడారు. బ్యాంకు, పొదుపు సంఘాల మహిళలకు ఇబ్బంది కలిగించేలా వైన్ షాపులు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహశీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్