నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

53చూసినవారు
నేడు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్
కర్నూలు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ను శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ది, కార్యదర్శి ఎల్. వి. శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో రాజీ కాగల క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, రోడ్డు ప్రమాద కేసులు, బ్యాంకు, మున్సిపల్, ప్రీలిటిగేషన్, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్