పాణ్యం: స్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

51చూసినవారు
ఓర్వకల్ మండలం నన్నూరు స్మశానవాటికలో కంపచెట్లు తొలగించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం నాయకులు నన్నూరు స్మశాన వాటికను పరిశీలించి, మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్మశాన వాటికలు ముళ్ళ పొదలతో నిండి, మృతదేహాలను తీసుకెళ్లాలేని పరిస్థితి నెలకొందన్నారు. స్మశాన స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్