పత్తికొండ: ఇక్కడ గుర్రాల పార్వేట నిర్వహించడం ఆనవాయితీ

64చూసినవారు
దసరా ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా మద్దికేరలో గుర్రాల పార్వేట వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని యాదవ రాజవంశీకులు పెద్దనగరి జయరామరాజు తెలిపారు. శనివారం ఆయన మద్దికెరలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఈ వేడుకను తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలివస్తారన్నారు. మద్దికేరను పాలించిన యాదవ రాజవంశీకులు భోగేశ్వరాలయంలో దసరా పండుగను పురస్కరించుకుని పూజలు నిర్వహించి, గుర్రాల పార్వేట చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్