రానున్న సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహాబతుల్లా ఆధ్వర్యంలో పలు కార్పెంటర్ కుటుంబాలు గురువారం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.