పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

65చూసినవారు
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రదానోపాధ్యాయురాలు రవణమ్మ ఆద్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని, ఆరోగ్యంగా ఉంటారన్నారు. పౌష్టికాహారం తినడంవల్ల రక్తహీనత దరిచేరదన్నారు.

సంబంధిత పోస్ట్