కరివేన వాలంటీర్ రాజీనామా

66చూసినవారు
ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన కిషోర్ అనే వాలంటీర్ బుధవారం తన బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ మేరకు సంబంధిత రాజీనామా పత్రాన్ని ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ మోహన్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వైఖరి నచ్చకపోవడం వల్లే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలోనే టిడిపిలోకి చేరనున్నట్లు వెల్లడించారు.