శ్రీశైలం నియోజకవర్గం త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ ముఖ్య నాయకులు ధూపం అభిమన్యుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వెలుగోడులోని ఆయన్ని మాజీ ఎమ్మెల్యే బుడ్డా మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టిడిపి జనసేన బిజెపి పార్టీలు పొత్తు ఏర్పడ్డాయని వెల్లడించారు.