మరికాసేపట్లో గూడూరుకు మాజీ సీఎం

1566చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో గూడూరుకు రానున్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్ ఎదురుగా సభా ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేశారు. సుమారు 20 లారీలలో విజయవాడ నుండి సభా ప్రాంగణ ఏర్పాట్లకు సంబంధించిన వస్తువులు, మనుషులూ వచ్చారు. 24 గంటల వ్యవధిలోనే పదివేల మంది కూర్చునేందుకు వీలుగా స్టేజీ, పక్కన రెస్ట్ రూంతోపాటు భారీ టెంట్ వేశారు. ఈ పనులను శివ, వెంకటేష్, రాజేష్ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్