పిడుగుపాటుకు గురై గేదె, దూడ మృతి

77చూసినవారు
పిడుగుపాటుకు గురై గేదె, దూడ మృతి
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై పాడే గేదే దూడ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అత్తింటి చంద్రమౌళి తన పొలంలో గేదెలు మేపుతుండగా పిడుగుపాటుకు గురై గేదెతో పాటు దూడ మృతి చెందాయి. వీటి విలువ రూ. లక్షకు పైనే ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.

సంబంధిత పోస్ట్