జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పపడితే బాధ్యులు పై కఠిన చర్యలను తీసుకుంటామని ఏపీఓఎల్ వి సుజాత హెచ్చరించారు. బుధవారం కందుకూరు ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బంది ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడితే వసూలు చేసిన నగదును తిరిగి వసూలు చేస్తామని వివరించారు. కూలీలు చేత కచ్చితంగా నాలుగు గంటలు పని చేయాలని పేర్కొన్నారు.