వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

83చూసినవారు
అల్లూరు మండలం పురిణి పంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ వైసిపి ప్రభుత్వంలో పొందిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ స్వాతి, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్