కావలిలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం

85చూసినవారు
కావలిలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం
కావలి పట్టణంలో మంగళవారం జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విఠలాచార్య సినిమాను తలపిస్తుందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే మాటలు ప్రజలు నమ్మరన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్