కోవూరులో రసవత్తరంగా ఎన్నికల పోరు

83చూసినవారు
కోవూరులో రసవత్తరంగా ఎన్నికల పోరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి గెలుపొందింది. కోవూరు నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాంగ్రెస్ నుండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కోవూరులో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

సంబంధిత పోస్ట్