కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం కొడవలూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఐదేళ్లలో దోచుకున్న సంపాదనలో ఐదు శాతం ఖర్చు చేసి ఉంటే గ్రామాలు బాగుపడేవని ప్రశాంతి రెడ్డి అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉండడం దురదృష్టకరమన్నారు.