కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్డిపాలెంలో ఆగిన అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.