32 మంది ఫించను దార్ల మృతికి కారణం సీఎం జగన్ మోహన్ రెడ్డి

551చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను దివాలా తీయించి పింఛను సొమ్ము పక్కదారి పట్టించి 32 మంది ఫించను దార్ల మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణమైనారని తెదేపా సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం దొరవారిసత్రం మండలంలోని ఉచ్చూరులో జరిగిన ప్రచారంలో మాట్లాడారు. తెదేపా అభ్యర్థిని నెలవల విజయశ్రీ, మాజీమంత్రి పరసా, ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్