ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో వింజమూరు లోని బొమ్మరాజు చెరువు గ్రామం వద్ద ఉన్న టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10 గం. నుంచి 12 గం. వరకు సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలముల నాయకత్వమునకు శిక్షణ. సాయంత్రం 4 నుండి 6 గం. వరకు వింజమూరు, కలిగిరి , కొండాపురం, జలదంకి మండలముల నాయకత్వమునకు శిక్షణ జరుగుతుంది.