పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శ

56చూసినవారు
పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శ
వెంకటగిరి మండలంలోని పాలకొండసత్రంలో పిచ్చికుక్క దాడిలో గాయపడిన 14 మందిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం పరామర్శించారు. ఆయన పాలకొండ సత్రం గ్రామానికి వెళ్ళి బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలకొండ సత్రం ప్రాథమి కోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాంబశివరావు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్