AP; విజయసాయి రెడ్డి ఆడిటర్ నుంచి ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే కీలక నేతగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. విజయసాయిరెడ్డి సడెన్గా తన పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు టాటా గుడ్ బై అనేశారు. అయితే ఆయనకు బీజేపీ నుంచి ఒక స్పష్టమైన హామీ లభించిందని అంటున్నారు. అదేంటి అంటే విజయసాయిరెడ్డికి రాజ్ భవన్కు దారులు తెరచుకోబోతున్నాయని తెలుస్తోంది. దీని అర్థం ఆయన గవర్నర్గా మళ్ళీ తెర ముందుకు రాబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది.