తెనాలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఓ వ్యక్తి రాయి విసిరినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిందితుడు నాగేశ్వరరావు తెలిపారు. పవన్ కళ్యాణ్కు షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో తన చేయి ఓ మహిళకు తగిలిందని, దాంతో ఆమె బంధువులు దాడి చేశారని తెలిపాడు. దాన్ని రాయి దాడిగా మార్చి పార్టీ నేతలు, కొందరు పోలీసులు తనపై దాడి చేసినట్లు నాగేశ్వరరావు స్వయంగా తెలియజేశారు.