

గన్నవరం: సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలి
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఎడమకాలువ 3వ జోన్ లో రైతులు ఈ సంవత్సరం 2. 36 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగుచేయటం జరిగిందని రక్షించడానికి వెంటనే సాగర్ జలాలను విడుదల చేయించాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమకాలువకు మొత్తం 32టిఎంసి లు విడుదల చెయ్యాల్సి ఉందని తెలిపారు.