![అర్థరాత్రి ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇక్కట్లు అర్థరాత్రి ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇక్కట్లు](https://media.getlokalapp.com/cache/ef/73/ef73162771900a98513e4ab16244294b.webp)
అర్థరాత్రి ఆగిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇక్కట్లు
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద హైవేపై ఎలిగన్స్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. బస్సు వైజాగ్ నుంచి హైదరాబాద్కు వెళుతుండగా అర్థరాత్రి 2 గంటలకు నిలిచిపోయింది. బస్సును అక్కడే వదిలి బస్సు డ్రైవర్, క్లీనర్ వెళ్లిపోయారు. డబ్బులు వెనక్కి ఇస్తామని ట్రావెల్స్ నిర్లక్ష్యపు సమధానం చెబుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల ఫిర్యాదుతో డ్రైవర్, క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.