జూపూడి ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు

56చూసినవారు
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో ఉపాధి హామీ పనులపై అధికారులు విచారణ చేయాలని కూలీలు సోమవారం డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని కూలీలు ఆరోపిస్తున్నారు. 100 మంది కష్టపడితే ఎక్కువమంది హాజరులో వేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు జమ పడుతున్నాయని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే పనికి రావద్దు అని అంటున్నారని కూలీలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్