రైతు కుటుంబానికి ఆర్థిక చేయూత

73చూసినవారు
రైతు కుటుంబానికి ఆర్థిక చేయూత
మృతి చెందిన మహిళా రైతు కుటుంబానికి సొసైటీ ద్వారా మంజూరైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదివారం అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ నారాయణరావు సతీమణి భారతి ఇటీవల మృతి చెందారు. సొసైటీలో రుణగ్రస్తురాలైన మహిళా రైతుకు సొసైటీ నుంచి రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ సొమ్ము మంజూరైంది. ఈ సొమ్మును చెక్కు రూపంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అందజేశారు.

సంబంధిత పోస్ట్