తిరువూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచేది తానే అని తిరువూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ అన్నారు. బుధవారం రాత్రి విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించిన ముఖ్యమంత్రి కి అందరూ అండగా నిలబడదామని కోరారు. సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయన ఇంటింటికీ పంచారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.