తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి వందన్ కుమార్ గెలుస్తారని మాజీ డిజిపి, బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు అన్నారు. విస్సన్నపేట మండలం మారేడుమండ, రాజీవ్ నగర్, తాతకుంట్ల గ్రామాల్లో గురువారం తిరువూరు అభ్యర్థి విజయం కోరుతూ రోడ్ షో నిర్వహించారు. రెండు పార్టీల మేనిఫెస్టోలు చిల్లరి మేనిఫెస్టోల్గా ఆయన విమర్శించారు. తిరువూరు అభ్యర్థిని గెలిపించాలని కోరారు.