ఐదు నెలలగా కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదు

75చూసినవారు
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం విస్సన్నపేట గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు గత 5 నెలల నుండి జీతాలు అందక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి వారి సమస్యలను తెలియజేశారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వెంటనే గ్రామ సర్పంచ్ సాధుపాటి నాగ మల్లేశ్వరి తో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అల్పాహారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్