ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ ఉడాకాలనీలో ఎన్నికల ప్రచార అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు.